సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి

ABN , First Publish Date - 2022-07-02T04:45:51+05:30 IST

జిల్లాలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను శుక్రవారం నుంచి పూర్తిగా నిషేధించాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పేయ్‌, జిల్లా అటవీఅధికారి దినేష్‌కుమార్‌తో కలిసి గ్రామీణాభివృద్ధి శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న పీవో వరుణ్‌రెడ్డి

- ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, జూలై 1: జిల్లాలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను శుక్రవారం నుంచి పూర్తిగా నిషేధించాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పేయ్‌, జిల్లా అటవీఅధికారి దినేష్‌కుమార్‌తో కలిసి గ్రామీణాభివృద్ధి శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌వల్ల పర్యావరణం కలుషి తమవుతుందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూలై1నుంచి 120మైక్రాన్స్‌ కంటే తక్కువఉన్న అన్ని రకాల ప్లాస్టిక్‌ను బ్యాన్‌చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పెద్ద మొత్తంలో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ వాడుతున్న వారిపై చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఎక్కడైనా వ్యాపారస్తులు వాటి ని విక్రయించినా, వాడినా కఠినచర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధి కారి సురేందర్‌, జిల్లా పంచాయతీ అదికారి రమేష్‌, ఈవో వంశీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T04:45:51+05:30 IST