ప్రముఖ గాయని సుశీలకు ప్రతిష్ఠాత్మక బ్రిటన్ పురస్కారం
ABN , First Publish Date - 2021-03-05T13:27:40+05:30 IST
మహిళా దినోత్సవం సందర్భంగా బ్రిటన్కు చెందిన యూకే ఉమెన్ నెట్వర్క్ (యూకేడబ్ల్యూనెట్) అందజేసే ప్రతిష్ఠాత్మక అవార్డుకు గాయని పి.సుశీల ఎంపికయ్యారు.
లండన్, మార్చి 4: మహిళా దినోత్సవం సందర్భంగా బ్రిటన్కు చెందిన యూకే ఉమెన్ నెట్వర్క్ (యూకేడబ్ల్యూనెట్) అందజేసే ప్రతిష్ఠాత్మక అవార్డుకు గాయని పి.సుశీల ఎంపికయ్యారు. ఏటా మహిళా దినోత్సవం రోజున.. యూకేడబ్ల్యూనెట్ ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్లో ఈ అవార్డును అందజేస్తారు. గత ఏడాది వరకు కేవలం ఇంగ్లండ్కు చెందిన వారినే ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. ఈ సారి బ్రిటన్ బయటి వారినీ పరిగణనలోకి తీసుకున్నారు. సింగపూర్, అమెరికా, జర్మనీ తదితర దేశాలకు చెందిన ఒక్కో మహిళను ఈ అవార్డు వరించగా.. ఏడుగురు భారతీయ మహిళలు యూకేడబ్ల్యూనెట్కు ఎంపికవ్వడం గమనార్హం..! ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. గాయని పి.సుశీలతోపాటు.. భారత్కు చెందిన ఎం.వనిత, సీడీఆర్ ప్రసన్న ఎడయిల్లియం, మధుమిత, సెల్వకుమారీ నటరాజన్, ఏఆర్ రెహానా, మాయా రాఘవన్లు ఈ నెల 6న జూమ్ మీటింగ్ ద్వారా జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకుంటారు.