బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి..
ABN , First Publish Date - 2022-01-22T04:11:05+05:30 IST
ప్రస్తుత పోటీ మార్కెట్లో నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే వినియోగదారులను కాపాడుకోవడానికి, కొత్త విని యోగదారులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని, ఈ నేపధ్యంలో నా ణ్యమైన బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని డైరెక్టర్లు (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, పీఅండ్పీ, ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరాం, ఈ అండ్ఎం డి.సత్యనారాయణ తెలిపారు.
కొత్తగూడెం, జనవరి 21: ప్రస్తుత పోటీ మార్కెట్లో నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే వినియోగదారులను కాపాడుకోవడానికి, కొత్త విని యోగదారులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని, ఈ నేపధ్యంలో నా ణ్యమైన బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని డైరెక్టర్లు (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, పీఅండ్పీ, ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరాం, ఈ అండ్ఎం డి.సత్యనారాయణ తెలిపారు. సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందంపై ఉన్న వినియోగదారులకు నిర్థేశిత గ్రేడ్ బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. బొగ్గు నాణ్యతపై శుక్రవారం కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా డైరెక్టర్లు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏరియాల వారీగా గత 9 నెలలుగా సరఫరా అయిన బొగ్గు నా ణ్యతను విశ్లేషించారు. సరఫరా చేస్తున్న బొగ్గు గ్రేడ్లను మూడో సంస్థ (థర్డ్ పార్టీ) ద్వా రా నాణ్యత నిర్థారణ చేసిన తర్వాతే చెల్లింపులు చేస్తున్నారని, నిర్థేశిత గ్రేడ్ బొగ్గు సరఫరా జరగకపోతే కంపెనీకి భారీ నష్టం వాటిల్లుతుందని అంతేకాకుండా కంపెనీ ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. బొగ్గు నాణ్యత విష యంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడొద్దని, సరఫరా సమయంలో కొంత శ్రద్దతో వినియోగదారులకు గ్రేడ్ శాటిస్ఫ్యాక్షన్ సంపూర్ణంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి తొల గింపులో రికార్డు స్థాయి లక్ష్యాలను సాధించే దిశగా కొనసాగుతున్నామని, నా ణ్యత ప్రమాణాల విషయంలోను అత్యున్నత ప్రమాణాలు సాధించేలా చూ డా లన్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.