జీవో 59 అమలుకు సింగరేణి గ్రీన్సిగ్నల్
ABN , First Publish Date - 2021-02-25T08:37:12+05:30 IST
సింగరేణిలో జీవో నంబరు 59 అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది.
ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ హర్షం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో జీవో నంబరు 59 అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. ప్రభుత్వ పనుల్లో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు 21 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా సర్కారు జీవో నంబరు 59ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో అమలు కోసం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చొరవ తీసుకున్నారు. సింగరేణి యాజమాన్యం నిర్ణయం పట్ల ఎర్రోళ్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి సింగరేణి కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల యువ కాంట్రాక్టర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.