విద్యాభివృద్ధిలో ఎడ్యుకేషన్ సొసైటీ కీలకం
ABN , First Publish Date - 2022-01-22T04:09:57+05:30 IST
సింగరేణి ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం సింగరేణి ఎడ్యూకేషన్ సొసైటీ కీలకపాత్ర పోషిస్తోందని సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం తెలిపారు.
సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం
రుద్రంపూర్, (సింగరేణి), జనవరి 21: సింగరేణి ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం సింగరేణి ఎడ్యూకేషన్ సొసైటీ కీలకపాత్ర పోషిస్తోందని సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం తెలిపారు. శుక్రవారం ఎడ్యూకేషన్ సొసైటీ 30వ వార్షిక సర్వసభ్య సమా వేశం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పిల్లల తోపాటు సమీప ప్రాంతాల వారికి ఉన్నతమైన విద్యను అందిం చేందుకు కృషి చేస్తుందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నూతన కమిటీని ఎంపిక చేశారు. కళాశాలలు, పాఠశాలల ఉత్తీర్ణత శాతాలపై చర్చించారు. విద్యకు సంస్థలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారా యణరావు, ఎడ్యూకేషన్ సొసైటీ జీఎం పద్మనాభ రెడ్డి, ఫైనాన్స్ జీఎం సుబ్బారావు, జీఎం పర్సనల్ అండ్ వెల్ఫేర్ ఆనందరావు, జీఎం సీపీపీ నాగభూషణ్ రెడ్డి, జీఎం సివిల్ రమేష్బాబు, సింగరేణి కంపెనీ కార్యదర్శి సునీతాదేవి, డీజీఎం ఎఫ్అండ్ఎ జీవీ రామారావు, పర్సనల్ మేనేజర్ అజేయ్కుమార్ తదిత రులు పాల్గొన్నారు.