AP NEWS: ఆ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే: రామచంద్రారెడ్డి
ABN , First Publish Date - 2022-05-20T00:34:17+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రావనివేనని చెప్పుకునే దమ్ము, ధైర్యం ప్రాంతీయ పార్టీలకు లేదని ..
కడప: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రానివేనని చెప్పుకునే దమ్ము, ధైర్యం ప్రాంతీయ పార్టీలకు లేదని కేంద్ర ప్రభుత్వ పథకాల రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి (Singareddy Ramachandrareddy) అన్నారు. కడప నగరంలో ప్రెస్ మీట్ (Press Meet) నిర్వహించిన ఆయన ఏపీలో కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. కేంద్ర పథకాలకు నేతల పేర్లతో మార్చుకోవడం సరికాదని సూచించారు. సంక్షేమ పథకాలకు కేంద్రం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేంద్రప్రభుత్వ ప్రభుత్వ పథకాలను వాడుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. పథకాలకు స్టిక్కర్లు వేసి రాష్ట్ర ప్రభుత్వానివిగా చెప్పుకోవడం తగదని సింగారెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.