మళ్లీ అధికారంలోకి సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లోంగ్‌

ABN , First Publish Date - 2020-07-12T07:10:23+05:30 IST

సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లోంగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు. కొవిడ్‌-19 వ్యాపించిన వాతావరణంలో శుక్రవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ(పీఏపీ) స్పష్టమైన మెజారిటీ సాధించింది...

మళ్లీ అధికారంలోకి సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లోంగ్‌

సింగపూర్‌, జూలై 11: సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లోంగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు. కొవిడ్‌-19 వ్యాపించిన వాతావరణంలో శుక్రవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ(పీఏపీ) స్పష్టమైన మెజారిటీ సాధించింది. పార్లమెంటులోని మొత్తం 105 సీట్లకుగాను 93 స్థానాలకు జరిగిన ఎన్నికలలో పీఏపీకి 83 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షం 10 సీట్లు గెలుచుకుంది.  ప్రధాని లీ సేన్‌ లోంగ్‌ పాలక పీఏపీకి సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ 1965లో సింగపూర్‌ స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి అధికారంలో కొనసాగుతోంది. 2015 పార్లమెంటరీ ఎన్నికలలో పీఏపీకి 69.9 శాతం ఓట్లు రాగా తాజా ఎన్నికలలో 61.24 శాతం ఓట్లు సాధించింది. తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, ఓటింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో రాలేదని ప్రధాని లీ లోంగ్‌ శనివారం మీడియాతో వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-07-12T07:10:23+05:30 IST