సెమీస్లో సింధు
ABN , First Publish Date - 2022-01-22T09:19:21+05:30 IST
భారత ఏస్ షట్లర్ పీవీ సింధు.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ సెమీ్సకు దూసుకెళ్లింది.
ప్రణయ్ అవుట్
లఖ్నవూ: భారత ఏస్ షట్లర్ పీవీ సింధు.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ సెమీ్సకు దూసుకెళ్లింది. మాల్విక భన్సోడ్, అనుపమ ఉపాధ్యాయ్, మిథున్ మంజునాథ్ కూడా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో టాప్ సీడ్ సింధు 11-21, 21-12, 21-17తో సుపనిడా కటేథింగ్ (థాయ్లాండ్)పై గెలిచింది. మాల్విక 21-11, 21-11తో ఆకర్షి కశ్య్పపై, అనుపమ 24-22, 23-21తో సమియా ఫరూకీపై గెలిచారు. సెమీ్సలో రష్యా షట్లర్ ఎవగినియా కొసెట్స్కయాతో సింధు, మాల్వికతో అనుపమ తలపడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్లో హెచ్ఎ్స ప్రణయ్ పోరాటం ముగిసింది. క్వార్టర్స్లో ప్రణయ్ 19-21, 16-21తో అర్నౌడ్ మెర్కెల్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. కాగా, మిథున్ 11-21, 21-12, 21-18తో సెర్జీ సిరాంట్ (రష్యా)ను ఓడించి సెమీస్కు చేరుకున్నాడు.