సింధు ముందుకు.. సైనా ఇంటికి

ABN , First Publish Date - 2021-10-28T07:34:00+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ రెండో రోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ సింధు తొలి

సింధు ముందుకు.. సైనా ఇంటికి

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ రెండో రోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ సింధు తొలి రౌండ్లో విజయం సాధించగా.. సైనా నెహ్వాల్‌ మ్యాచ్‌ మధ్యలో గాయం కారణంగా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి ఇంటిముఖం పట్టింది. సింధు 21-15, 21-18తో జూలీ జాకోబ్సెన్‌ (డెన్మార్క్‌)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సయాక టకాషి (జపాన్‌)తో తలపడిన సైనా 11-21తో తొలి గేమ్‌లో ఓడిపోగా రెండో గేమ్‌లో 2-9 స్కోరు వద్ద గాయంతో తప్పుకొంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ టాప్‌ సీడ్‌ కెంటో మొమోట (జపాన్‌) చేతిలో పోరాడి ఓడాడు. గంట 20 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో శ్రీకాంత్‌ 18-21, 22-20, 19-21తో పరాజయం పాలయ్యాడు. ఇక, పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సమీర్‌ వర్మ, లక్ష్యసేన్‌, సౌరభ్‌ వర్మ ముందంజ వేయగా పారుపల్లి కశ్యప్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ ఆర్జున్‌-ధ్రువ్‌ కపిల జోడీ, సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ద్వయం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్వినీ పొన్నప్ప జంట అద్భుత విజయాలతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాయి.

Updated Date - 2021-10-28T07:34:00+05:30 IST