ప్రీ క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2021-01-20T06:52:12+05:30 IST

టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. సైనా నెహ్వాల్‌ మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన సింగిల్స్‌ ఆరంభ రౌండ్‌లో ఆరోసీడ్‌ సింధు 21-17

ప్రీ క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

బ్యాంకాక్‌: టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. సైనా నెహ్వాల్‌ మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన సింగిల్స్‌ ఆరంభ రౌండ్‌లో ఆరోసీడ్‌ సింధు 21-17, 21-13తో బుసానన్‌ ఆంగ్‌బమ్రంగ్‌పన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. సైనా 17-21, 8-21తో రచనోక్‌ ఇంటనాన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. పురుషుల తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-11, 21-11తో సితికోమ్‌ థామసిన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గగా, సమీర్‌ వర్మ 18-21, 27-25, 25-19తో 8వ సీడ్‌ లీ జీ జియా (మలేసియా)కు షాకిచ్చాడు. సౌరభ్‌ వర్మ 16-21, 11-21తో ఆంటోనీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. కశ్యప్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 22-20, 28-26తో మను అత్రి-సుమిత్‌ ద్వయంపై నెగ్గింది. మిక్స్‌డ్‌ ఆరంభ రౌండ్‌లో అశ్వినీ-సాత్విక్‌ జంట 23-21, 21-18తో నిక్లాస్‌ నోహర్‌-మెగ్‌లాండ్‌ (డెన్మార్క్‌) ద్వయాన్ని ఓడించింది. 

Updated Date - 2021-01-20T06:52:12+05:30 IST