క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2021-03-05T09:29:53+05:30 IST

స్విస్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌తోపాటు సాత్విక్‌ జోడీలు క్వార్టర్స్‌కు చేరుకొన్నాయి. కాగా, సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది...

క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్‌

  • పోరాడి ఓడిన సైనా 
  • స్విస్‌ ఓపెన్‌

బాసిల్‌: స్విస్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌తోపాటు సాత్విక్‌ జోడీలు క్వార్టర్స్‌కు చేరుకొన్నాయి. కాగా, సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ సింధు 21-13, 21-14తో ఐరిస్‌ వాంగ్‌ (అమెరికా)పై అలవోకగా నెగ్గింది. పురుషుల రెండో రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-10, 14-21, 21-14తో థామస్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. సాయి ప్రణీత్‌ 21-12, 21-17తో అబియన్‌ (స్పెయిన్‌)పై నెగ్గాడు. మిక్స్‌డ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప జంట 21-18, 21-16తో రివాల్డీ-పిటా హింగ్టియాస్‌ను ఓడించింది. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ద్వయం 21-18, 21-16తో కుసుమవర్దన-ఇరిచ్‌ యోచే యాకోబ్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకొంది. కాగా, అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జంట 11-21, 5-21తో డెన్మార్క్‌కు చెందిన అమేలి మెగ్లాండ్‌-ఫ్రెజా రౌన్‌ చేతిలో ఓటమి పాలైంది. 

సైనా,  కశ్యప్‌ ఇంటికి..: ఒలింపిక్‌ పతక విజేత సైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. సైనా 16-21, 21-17, 21-23తో పిట్యపోర్న్‌ చైవాన్‌ (థాయ్‌) చేతిలో పోరాడి ఓడింది. పారుపల్లి కశ్యప్‌ 15-21, 10-21తో పాబ్లో అబియన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడాడు. 


Updated Date - 2021-03-05T09:29:53+05:30 IST