సింధు, ప్రణయ్‌ నిష్క్రమణ

ABN , First Publish Date - 2022-07-02T10:01:33+05:30 IST

మలేసియా ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణ య్‌ క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమించారు.

సింధు, ప్రణయ్‌ నిష్క్రమణ

మలేసియా ఓపెన్‌

కౌలాలంపూర్‌ : మలేసియా ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణ య్‌ క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమించారు. చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్‌ (తైపీ)తో శుక్రవారం జరిగిన మూడు గేమ్‌ల హోరాహోరీ క్వార్టర్స్‌ పోరులో 21-13, 15-21, 13-21తో ఏడో సీడ్‌ సింధు పరాజయం చవిచూసింది. దాంతో రెండో సీడ్‌ తైజుతో జరిగిన చివరి ఆరు మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడినట్టయింది. మరోవైపు ప్రణయ్‌ 18-21, 16-21తో ఏడవ సీడ్‌ ఆటగాడు జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు.



Updated Date - 2022-07-02T10:01:33+05:30 IST