నీట్‌ ర్యాంకర్‌కు సత్కారం

ABN , First Publish Date - 2020-11-30T05:13:36+05:30 IST

నీట్‌ ప్రవేశ పరీక్షలో ఏపీలో ప్రథమ ర్యాంకు సాధించిన సింధుని విద్యార్థులంతా స్ఫూర్తిగా తీసుకోవాలని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం సూచించారు.

నీట్‌ ర్యాంకర్‌కు సత్కారం
సింధుని సత్కరిస్తున్న ఏసురత్నం తదితరులు

గుంటూరు, నవంబరు 29: నీట్‌ ప్రవేశ పరీక్షలో ఏపీలో ప్రథమ ర్యాంకు సాధించిన సింధుని విద్యార్థులంతా స్ఫూర్తిగా తీసుకోవాలని  మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం సూచించారు. ఇక్కుర్తి వెంకట్‌ ఆధ్వర్యంలో బ్రాడీపేటలో సింఽధుకి అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ విద్యార్థులు  ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బండ్లమూడి రోజారాణి, మన్నేపల్లి హనుమంతరావుశర్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T05:13:36+05:30 IST