అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2020-08-10T10:19:07+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ దర్శించుకున్నారు.
సింహాచలం, ఆగస్టు 9: సింహాద్రి అప్పన్న స్వామిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ దర్శించుకున్నారు. ఆయనకు ఏఈవో పులి రామారావు ఆహ్వా నం పలికారు. ముందుగా ఆయన నీలాద్రి గుమ్మం వద్ద నుంచి స్వామివారిని దర్శించుకుని కప్పస్తంభం వద్ద ప్రార్థనలు చేశారు. గోదాదేవి అమ్మవారిని దర్శించాక అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తితో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథ్ శర్మ, న్యాయమూర్తులు యు.సత్యారావు, జి.చక్రపాణి కూడా స్వామివారిని దర్శించు కున్నారు.