సింహాచలం క్షేత్రంలో అపచారం జరిగింది: శ్రీనివాసానంద సరస్వతి

ABN , First Publish Date - 2021-09-03T23:00:22+05:30 IST

సింహాచలం క్షేత్రంలో అపచారం జరిగిందని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు.

సింహాచలం క్షేత్రంలో అపచారం జరిగింది: శ్రీనివాసానంద సరస్వతి

విశాఖ: సింహాచలం క్షేత్రంలో అపచారం జరిగిందని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింహాచలం క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం ఇవ్వడాన్ని ఖండిస్తున్నానని ప్రకటించారు. కోర్టు తీర్పు తర్వాత సింహాచలానికి వచ్చిన అశోక్ గజపతికి పూర్ణకుంభ స్వాగతం పలకలేదని తప్పుబట్టారు. ఈ రోజు విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలకడం ఏమిటీ? అని ప్రశ్నించారు. ఎవరికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వాలో.. ఎవరికి ఇవ్వకూడదో తెలియదా అని నిలదీశారు. అర్హత లేని వారికి పూర్ణకుంభ స్వాగతం పలికితే రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో ఇదే పద్ధతి వస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈవో, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసమర్ధ దేవాదాయశాఖ మంత్రి ఉండడం వల్లే అపచారాలు జరుగుతున్నాయని శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు.

Updated Date - 2021-09-03T23:00:22+05:30 IST