Mirabai Chanuకి మణిపూర్ ప్రభుత్వం మరో గౌరవం!

ABN , First Publish Date - 2021-07-27T00:19:27+05:30 IST

టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఆమెను అడిషనల్

Mirabai Chanuకి మణిపూర్ ప్రభుత్వం మరో గౌరవం!

ఇంఫాల్: టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఆమెను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా నియమించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తెలిపారు. ఇటీవల ప్రకటించినట్టు ఆమె కోటి రూపాయల రివార్డు అందించనున్నట్టు చెప్పారు. దీనికి అదనంగా ఈ పోస్టులో ఆమెను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే జూడో క్రీడాకారిణి లిక్మాబమ్ సుశీల దేవిని కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోట్ చేయనున్నట్టు చెప్పిన సీఎం.. ఒలిపింక్స్‌లో పాలుపంచుకున్నందుకు గాను రూ. 25 లక్షల రివార్డు ఇవ్వనున్నట్టు వివరించారు. 


ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజత పతకం అందించిన మీరాబాయి చాను ఈ రోజు స్వదేశం చేరుకుంది. న్యూ ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె ల్యాండ్ అయిన వెంటనే అభిమానులు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

Updated Date - 2021-07-27T00:19:27+05:30 IST