వెంకన్నకు వెండి తాబేలు బహూకరణ

ABN , First Publish Date - 2021-02-28T07:08:59+05:30 IST

పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టణ ప్రముఖులు బోయళ్ల తిరుపతిరెడ్డి దంపతులు శనివారం వెండి తాబేలును బహూకరించారు.

వెంకన్నకు వెండి తాబేలు బహూకరణ
వెండి తాబేలును బహుకరిస్తున్న దాతలు

కనిగిరి, ఫిబ్రవరి 27: పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టణ ప్రముఖులు బోయళ్ల తిరుపతిరెడ్డి దంపతులు శనివారం వెండి తాబేలును బహూకరించారు. ఎంతో విలువైన వెండి తాబేలును ఆలయ అధ్యక్షకార్యదర్శులు గోనుగుంట గోపాల కృష్ణమూర్తి, నార్లపాటి సాంబ చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాబేలు బహుకరించిన బోయళ్ల తిరుపతిరెడ్డి దంపతులను ఆలయ కమిటి ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసింది. కార్యక్రమంలో వాగిచర్ల వెంకటేశ్వర్లు, చక్కా బసవేశ్వరరావు, బచ్చు వెంగయ్య, ఇన్నమూరి సుబ్బారావు, మహేష్‌, నారపురెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T07:08:59+05:30 IST