డంపింగ్‌యార్డు తొలగించాలని మౌనదీక్ష

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం దమ్మాయిగూడ

డంపింగ్‌యార్డు తొలగించాలని మౌనదీక్ష

కీసర రూరల్‌: మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం దమ్మాయిగూడ మున్సిపల్‌ ప్రాంత ప్రజలు తమ ఇళ్లల్లో మౌనదీక్ష పాటించి నిరసన వ్యక్తం చేశారు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ నోటికి మాస్కు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వృద్ధులు, యువకులు, చిన్నారులు, ఉద్యోగులు ప్రతిఒక్కరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. డంపింగ్‌యార్డు సమస్యపై ప్రభుత్వం స్పందించేంత వరకు రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు, సామాజిక కార్యకర్తలు వెల్లడించారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST