సెమీస్లో సిక్కి జోడీ ఓటమి
ABN , First Publish Date - 2022-10-02T09:33:22+05:30 IST
భారత జోడీ సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ వియత్నాం ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ చేరడంలో విఫలమైంది.
హో చి మిన్ (వియత్నాం): భారత జోడీ సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ వియత్నాం ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ చేరడంలో విఫలమైంది. సెమీస్లో సిక్కిద్వయం 16-21, 14-21తో టాప్సీడ్ రేహన్-లిసా (ఇండోనేసియా) చేతిలో ఓటమిపాలైంది.