సిక్కింలో జూన్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలు పునర్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-23T13:20:33+05:30 IST

పాఠశాలలు, కళాశాలలను జూన్ 15వతేదీ నుంచి పునర్ ప్రారంభించాలని సిక్కిం సర్కారు నిర్ణయించింది....

సిక్కింలో జూన్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలు పునర్ ప్రారంభం

గ్యాంగ్‌టక్ (సిక్కిం): పాఠశాలలు, కళాశాలలను జూన్ 15వతేదీ నుంచి పునర్ ప్రారంభించాలని సిక్కిం సర్కారు నిర్ణయించింది. సిక్కిం రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలను జూన్ 15 వతేదీ నుంచి పునర్ ప్రారంభిస్తామని సిక్కిం విద్యాశాఖ మంత్రి కేఎన్ లెప్చా వెల్లడించారు. 9 నుంచి 12 వతరగతి విద్యార్థులకు జూన్ 15వతేదీ నుంచి తరగతులు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. నర్సరీ నుంచి 8వతరగతి విద్యార్థులకు తరగతులు తర్వాత నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించమని, విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి చెప్పారు. సిక్కింలో తాజాగా ఎలాంటి కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలను జూన్ 15 నుంచి పునర్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు. 

Updated Date - 2020-05-23T13:20:33+05:30 IST