Kabul Attack : పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ సురక్షితం
ABN , First Publish Date - 2022-06-18T22:47:31+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లో గురుద్వారా కర్టే పర్వాన్పై ఉగ్రవాద
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లో గురుద్వారా కర్టే పర్వాన్పై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో సిక్కుల పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఉగ్రవాద దాడుల్లో అగ్ని జ్వాలల్లో చిక్కుకున్న ఈ గురుద్వారాలోకి సాహసోపేతులైన సిక్కులు ప్రవేశించి, తమ పవిత్ర గ్రంథాన్ని కాపాడుకున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) రాజధాని నగరం కాబూల్ (Kabul)లో గురుద్వారా కర్టే పర్వాన్ శనివారం పేలుళ్ళతో దద్దరిల్లింది. మొత్తం ప్రాంగణం అగ్ని జ్వాలల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, తాలిబన్ సైనికులు ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడుల వెనుక ఐసిస్ ఖొరసాన్ (ISIS Khorasan) ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
ఈ నేపథ్యంలో మంటల్లో చిక్కుకున్న గురుద్వారాలోకి కొందరు సిక్కులు సాహసోపేతంగా ప్రవేశించి, తమ పవిత్ర గ్రంథాన్ని సురక్షితంగా గురుద్వారా కర్టె పర్వాన్ (Gurdwara Karte Parwan) అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ నివాసానికి చేర్చగలిగారు. అక్కడ వీరు తమ మతాచారాల ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు.