కరోనా ఎఫెక్ట్ : నగరంలో గణనీయంగా తగ్గిన కాలుష్యం

ABN , First Publish Date - 2020-04-04T23:39:26+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో జనసంచారం బాగా తగ్గిపోవడంతో కాలుష్యం కూడా తగ్గిపోయినట్లు కాలుష్య నియంత్రణ మండలి

కరోనా ఎఫెక్ట్ : నగరంలో గణనీయంగా తగ్గిన కాలుష్యం

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో జనసంచారం బాగా తగ్గిపోవడంతో కాలుష్యం కూడా తగ్గిపోయినట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో తెలిపింది. వంద నుంచి 54కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గడం గత ఇరవై ఏళ్లలో ఇదే ప్రథమమని పేర్కొంది. వాహనాలన్నీ ఇంటికే పరిమితమైపోవడంతో కాలుష్యం తగ్గింది. సౌండ్ పొలుష్యన్‌తో పాటు ఏయిర్ పొలుష్యన్ కూడా తగ్గినట్లు పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రతి రోజూ ఆ పరిశ్రమల నుంచి కూడా కాలుష్యం అధిక మొత్తంలోనే వెలువడుతుంది. అయితే లాక్‌డౌన్ అమలులో ఉన్న సందర్భంగా అవి కూడా మూత పడ్డాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ప్రజలు అనవసరంగా వాహనాలు వాడకుండా ఉంటే నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని, దీనిని పాటిస్తే మేలని పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-04-04T23:39:26+05:30 IST