తిరుచ్చి కళాశాల సెక్రటరీ కరోనాతో మృతి
ABN , First Publish Date - 2020-08-07T13:44:57+05:30 IST
తిరుచిరాపల్లి నగరంలోని శ్రీమతి ఇందిరాగాంధీ కళాశాల కార్యదర్శి ఎస్ కుంజితపథం (59) కరోనాతో మరణించారు....
తిరుచిరాపల్లి : తిరుచిరాపల్లి నగరంలోని శ్రీమతి ఇందిరాగాంధీ కళాశాల కార్యదర్శి ఎస్ కుంజితపథం (59) కరోనాతో మరణించారు.వృత్తిరీత్యా న్యాయవాది అయిన కుంజిత పథంకు పరీక్షించగా కొవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. దీంతో ఇతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న కుంజితపథం చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి భార్య మీనా భారతీదాసన్ యూనివర్శిటీ మాజీ వీసీ.