అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్‌

ABN , First Publish Date - 2021-09-19T05:02:45+05:30 IST

వత్తలూరు పంచాయతీ దేవసముద్రం చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను శుక్రవారం అర్ధరాత్రి సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సీజ్‌ చేసినట్లు పుల్లంపే ట రెవెన్యూ అధికారులు తెలిపారు.

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్‌
రాజంపేట తహసీల్దారు కార్యాలయంలో పట్టుబడ్డ టిప్పర్లు

పుల్లంపేట, సెప్టెంబరు18: వత్తలూరు పంచాయతీ దేవసముద్రం చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను శుక్రవారం అర్ధరాత్రి సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సీజ్‌ చేసినట్లు పుల్లంపే ట రెవెన్యూ అధికారులు తెలిపారు. చెరువులో కొన్ని నెలలుగా అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని రైతులు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అర్ధరాత్రి రాజంపేట తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, పుల్లంపేట ఆర్‌ఐ అల్లాబక్ష్‌, వీఆర్వోతో కలిసి వాహనాలను సీజ్‌ చేసి రాజంపేట తహసీల్దారు కార్యాలయానికి తరలించారు. 

రెండు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం - కేసు నమోదు

సంబేపల్లె, సెప్టెంబరు18: నారాయణరెడ్డిపల్లె గ్రామం ఎర్రగుంట్ల సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల ను సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి బీట్‌కి వెళ్లిన పోలీసులు ఇసుకను తరలిస్తున్న ట్రా క్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 



Updated Date - 2021-09-19T05:02:45+05:30 IST