లాక్‌డౌన్‌ అమలు నుంచి 5,204 వాహనాల సీజ్‌

ABN , First Publish Date - 2020-04-09T11:32:19+05:30 IST

లాక్‌డౌన్‌ అమలులో నిబంధనలు అతిక్రమించిన 5,204 వాహనాలను సీజ్‌ చేశామని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు చేసిన మార్చి

లాక్‌డౌన్‌ అమలు నుంచి 5,204 వాహనాల సీజ్‌

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సీపీ


కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 8: లాక్‌డౌన్‌ అమలులో నిబంధనలు అతిక్రమించిన 5,204 వాహనాలను సీజ్‌ చేశామని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు చేసిన మార్చి 22నుంచి ఈనెల 7వరకు అకారణంగా రోడ్లపైకి వచ్చిన 2,564వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేసి, జరిమానాలు విధించామన్నారు. 2,640మంది వాహనదారులకు ఈ-చలాన్‌ ద్వారా జరిమానా విధించామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 10మందితోపాటు, హోంక్వారంటైన్‌, ఐసోలేషన్‌ నిబంధనలు అతిక్రమించిన నలుగురిపై కేసులు నమోదు చేశామన్నారు.

Updated Date - 2020-04-09T11:32:19+05:30 IST