Sids Farm: ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేసిన సిద్స్‌ ఫామ్

ABN , First Publish Date - 2022-08-17T01:32:18+05:30 IST

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫామ్ ఏ2 దేశీ ఆవుపాలను

Sids Farm: ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేసిన సిద్స్‌ ఫామ్

హైదరాబాద్: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫామ్ ఏ2 దేశీ ఆవుపాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ2 ఆవుపాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సిద్స్ ఫామ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీ బుకింగ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరు గంటల్లో ఏకగా 400మందికిపైగా వినియోగదారులు 350 లీటర్ల పాలను బుక్ చేసుకోవడం గమనార్హం. దేశీ ఆవుపాల అరలీటర్ ధరను రూ. 75గా నిర్ణయించింది. 


ఏ2 పాలకు సాధారణ పాలకు మధ్య తేడా ఇదే

సాధారణ పాలలో ఏ1 బీటా కాసిన్ ఉంటే.. ఏ2 పాలలో కేవలం ఏ2 బీటా కేసిన్ మాత్రమే ఉంటుంది. ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకుంటున్న ప్రజలు ఏ2 పాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్స్ ఫామ్ ఈ పాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సిద్స్ ఫామ్ ఫౌండర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ.. ఏ2 దేశీ ఆవుపాలను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. వినియోగదారులకు కల్తీ లేని ఉత్పత్తులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలన్నారు. కాగా, హైదరాబాద్ వినియోగదారులు సిద్స్ ఫామ్ యాప్ ద్వారా ఏ2 దేశీ ఆవు పాలను బుకింగ్ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-08-17T01:32:18+05:30 IST