కువైట్‌లో సిద్దిపేట వాసి మృతి

ABN , First Publish Date - 2021-03-31T02:08:16+05:30 IST

గల్ఫ్ దేశమైన కువైట్‌లో జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. జీవనోపాధి

కువైట్‌లో సిద్దిపేట వాసి  మృతి

సిద్దిపేట: గల్ఫ్ దేశమైన కువైట్‌లో జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. జీవనోపాధి కోసం దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామానికి చెందిన మహ్మద్ షాదుల్లా కువైట్ వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహన్ని కువైట్ నుంచి తెప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతుడు షాదుల్లాకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 



Updated Date - 2021-03-31T02:08:16+05:30 IST