సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా
ABN , First Publish Date - 2021-04-17T01:35:28+05:30 IST
సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా
సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో వివిధ వార్డుల నుంచి పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 4వ వార్డు నుంచి కొండం కవిత - సంపత్ రెడ్డి.. ( జనరల్ మహిళ ), 8వ వార్డు నుంచి వరాల కవిత - సురేష్..( బీసీ మహిళ ) 17వ వార్డు నుంచి మాల్యాల జ్యోతి - ప్రశాంత్ పోటీ చేస్తారని మంత్రి తెలిపారు. అలాగే 31 వ వార్డు జంగిటి కనకరాజు ( బీసీ జనరల్ ) , 34వ వార్డు నుంచి గుడాల సంధ్య - శ్రీకాంత్ ( జనరల్ మహిళ ), 37వ వార్డు నుంచి సాకి బాల్ లక్ష్మీ - ఆనంద్ ( ఎస్సీ మహిళ ) లు పోటీ చేస్తారని మంత్రి ప్రకటించారు.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈనెల 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, మే నెల 3వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు. గురువారం ఉదయమే 43 వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులంతా నామినేషన్ల సమర్పణపై దృష్టి పెట్టారు.
తాజా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం కల్పించారు. 18 వరకు నామినేషన్లు సమర్పిస్తే 22వ తేదీన ఉపసంహరణలు పూర్తయి తుది అభ్యర్థుల జాబితా ఖరారవుతుంది. ఇక 23 నుంచి 28 వరకే అధికారికంగా ప్రచారం చేసుకోవచ్చు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. నడుమ ఒకరోజు మినహాయిస్తే 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. దీంతో పార్టీ టిక్కెట్లపై భరోసా ఉన్న అభ్యర్థులు తమకు అనుకూల రిజర్వేషన్లు రావడంతోనే ప్రచారంలోకి దిగారు.
ఎన్నికల షెడ్యూల్
16-04-2021 నోటిఫికేషన్ జారీ
16-04-2021 నుంచి
18-04-2021 వరకు నామినేషన్ల స్వీకరణ
19-04-2021 నామినేషన్ల పరిశీలన
20-04-2021 నామినేషన్ల తిరస్కరణ
21-04-2021 అభ్యంతరాల స్వీకరణ
22-04-2021 నామినేషన్ల ఉపసంహరణ
30-04-2021 ఎన్నికల నిర్వహణ
03-05-2021 ఎన్నికల ఫలితాల ప్రకటన