సిద్దిపేట జిల్లా: ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్
ABN , First Publish Date - 2021-12-05T17:52:40+05:30 IST
సిద్దిపేట జిల్లా: రేణుక నగర్ కాలనీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మిస్సింగ్ అయ్యింది.
సిద్దిపేట జిల్లా: రేణుక నగర్ కాలనీలో గత కొంతకాలంగా తాత, అమ్మమ్మ దగ్గర ఉంటున్న భార్గవి అనే యువతి మిస్సింగ్ అయ్యింది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం కాలేజీకి వెళ్లిన బార్గవి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతటా విచారణ జరిపిన అనంతరం కుటుంబసభ్యులు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.