సిద్దిపేట: కొమురవెళ్లి మండల కేంద్రంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-21T00:54:54+05:30 IST

జిల్లాలోని కొమురవెళ్లి మండల కేంద్రంలో కరోనా

సిద్దిపేట: కొమురవెళ్లి మండల కేంద్రంలో కరోనా కలకలం

సిద్దిపేట: జిల్లాలోని  కొమురవెళ్లి మండల కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక ఎస్ఐతో పాటు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కొమురవెళ్లి  మల్లికార్జున స్వామి జాతర కోసం బందోబస్తు ఏర్పాట్లకు వచ్చిన సుమారు 50 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్‌కు కరోనా నిర్ధారణ అయింది. మల్లికార్జున స్వామి ఆలయ తాత్కాలిక సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. చేర్యాల మండలం ముస్త్యాలలో బ్యాంక్ సిబ్బందికి కరోనా వచ్చింది. 


Updated Date - 2022-01-21T00:54:54+05:30 IST