సిద్దేశ్వరం అలుగు తోనే సాగు వెలుగులు

ABN , First Publish Date - 2022-05-25T04:57:47+05:30 IST

రాయలసీమ బీడు భూముల్లో సాగువెలుగు ల కోసం సిద్దేశ్వరం అలు గు సాధించుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షు డు బొజ్జా దశరధరామిరెడ్డి పిలుపునిచ్చారు.

సిద్దేశ్వరం అలుగు తోనే సాగు వెలుగులు
సిద్దేశ్వరం అలుగు సాధన కోసం చేపడుతున్న జలదీక్ష పోస్టర్లు ఆవిష్కరిస్తున్న బొజ్జా దశరధరామిరెడ్డి

జలదీక్షపై కిసాన్‌సంఘ్‌ రైతు సదస్సు : బొజ్జా దశరధరామిరెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్‌ మే 24: రాయలసీమ బీడు భూముల్లో సాగువెలుగు ల కోసం సిద్దేశ్వరం అలు గు సాధించుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షు డు బొజ్జా దశరధరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వెల్లాలలో సిద్దేశ్వరం అలుగు సాధనకోసం జరిగే జలదీక్షపై భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యం లో రైతులతో సదస్సు నిర్వహించింది. ఈసదస్సులో మే 31న సిద్దేశ్వరం వద్ద జరిగే జలదీక్ష పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ రాయలసీమకు సాగు, తాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

50 ఏళ్లగా సీమ ప్రజానీకపు సమస్యలను గుర్తించని ప్రభుత్వాలపై ఒత్తిడితేలేని పార్టీల వైఖరిని ఆయన ఎండగట్టారు. రాజకీయ పార్టీలు అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయేతప్ప చిత్తశుద్దితో సీమకు నిఖరజలాలు అందించే సిద్దేశ్వరం విషయంలో కృషి చేయడంలేదన్నారు. సీమ ప్రాజెక్టులు అనుమతులులేని ప్రాజెక్టులుగా కెఆర్‌ఎంబీ బోర్డు ప్రకటిస్తే ప్రభుత్వం గానీ ప్రతిపక్షపార్టీలు గానీ దానిపై తీవ్రంగా స్పందించి పోరాడలేదన్నారు. అందుకే రాయలసీమ ప్రజలు రైతాంగం లో సిద్దేశ్వరం అలుగుపై అవగాహన కల్పించేందుకు సీమలోని గ్రామాలు పర్యటిస్తున్నామన్నారు. మే 31 సిద్వేశ్వరం వద్ద జరిగే జలదీక్షను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిసాన్‌సంఘ్‌ నేతలు వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T04:57:47+05:30 IST