ఎల్‌ఐసీ ఎండీగా సిద్ధార్థ మొహంతి

ABN , First Publish Date - 2021-01-20T09:01:59+05:30 IST

భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు.

ఎల్‌ఐసీ ఎండీగా సిద్ధార్థ మొహంతి

న్యూఢిల్లీ : భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. 2023 జూన్‌ 30 వరకు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు.  కాగా టెలికమ్యూకేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీగా సంజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు.

 

 ఏంజెల్‌ బ్రోకింగ్‌.. ఇన్వెస్టర్ల కోసం స్మార్ట్‌ మనీ పేరుతో ప్రత్యేకంగా ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. పెట్టుబడుల లక్ష్యాలు, టెక్నికల్స్‌, ఫండమెంటల్స్‌ వంటి  వాటి వివరాలను ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందించనుంది. 


 వివో.. మార్కెట్లోకి వై సిరీ్‌సలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ వివో వై20జీ విడుదల చేసింది. దీని ధర రూ.14,990. జీ 80 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్‌ను తీసుకువచ్చింది.. 


 పుణె నుంచి హైదరాబాద్‌కు 30 బాక్సులు, విజయవాడకు 35 బాక్సుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను  తరలించినట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది. 4.1 టన్నుల బరువైన వ్యాక్సిన్‌ను పుణె నుంచి హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌, పాట్నాకు రవాణా చేసినట్లు పేర్కొంది. 

Updated Date - 2021-01-20T09:01:59+05:30 IST