దివ్యాంగుల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2022-07-08T03:18:00+05:30 IST
ఈనెల 23, 24వ తేదీల్లో నెల్లూరు రెడ్క్రాస్ సమావేశ మందిరంలో నిర్వహించే ఉచిత కృత్రిమ అవయవాల ఏర్పాటు శిబిరాన్ని
ఉదయగిరి రూరల్, జూలై 7: ఈనెల 23, 24వ తేదీల్లో నెల్లూరు రెడ్క్రాస్ సమావేశ మందిరంలో నిర్వహించే ఉచిత కృత్రిమ అవయవాల ఏర్పాటు శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకృతి వైఫరీత్యాల జిల్లా కన్వీనర్ టీ భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో రెడ్క్రాస్ ఉదయగిరి బ్రాంచ్ చైర్మన్ గాజుల ఫారుఖ్అలీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడు తూ కృత్రిమ కాళ్లు, చేతులు అవసరమైన దివ్యాంగు లం దరికీ ఉచితంగా అమర్చుతామన్నారు. అమరికలో భాగంగా వారి నుంచి స్ర్కీనింగ్, కొలతలు సేకరిస్తామన్నారు. అవసరమైన దివ్యాంగులు ఈనెల 21వ తేదీలోగా పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దారు సానా శ్రీనివాసులరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు గాజుల తాజుద్దీన్, జేవీవీ నాయకులు దస్తగిరి అహ్మద్, గౌస్బాషా తదితరులు పాల్గొన్నారు.