సప్తగిరి పుస్తకంతో పాటు సువార్త పుస్తకంపై విచారణ చేపట్టాం: ఎస్సై వీరేష్

ABN , First Publish Date - 2020-07-09T21:25:11+05:30 IST

గుంటూరు: 6వ తేదిన టీటీడీ పోస్టు ద్వారా సప్తగిరి పుస్తుకంతో పాటు సువార్త పుస్తకం వచ్చిందని వార్తలు వచ్చాయని తిరుపతి ఎస్సై వీరేష్ పేర్కొన్నారు.

సప్తగిరి పుస్తకంతో పాటు సువార్త పుస్తకంపై విచారణ చేపట్టాం: ఎస్సై వీరేష్

గుంటూరు: 6వ తేదిన టీటీడీ పోస్టు ద్వారా సప్తగిరి పుస్తుకంతో పాటు సువార్త పుస్తకం వచ్చిందని వార్తలు వచ్చాయని తిరుపతి ఎస్సై వీరేష్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టామని... గుంటూరు మల్లికార్జునపేటలో మాస పత్రిక తీసుకున్న విష్ణు వ్యక్తిని విచారించేందుకు వచ్చామన్నారు. ఆ రోజు పోస్టుమెన్ కవర్ ఇవ్వడంతో ఇంట్లోకి వెళ్లి చూసుకున్నాడన్నారు. సప్తగిరి పుస్తకంతో పాటు సువార్త సజీవ పుస్తకం ఉందని పోస్టు తీసుకున్నానని విష్ణు చెప్తున్నాడన్నారు. పోస్టల్లో ఉన్న అడ్రస్ గుంటూరులో అడ్రస్ ఒక్కటేనన్నారు. పోస్టుమెన్‌ను కూడా విచారిస్తామని... పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై వీరేష్ తెలిపారు.

Updated Date - 2020-07-09T21:25:11+05:30 IST