ఎస్ఐను సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2020-07-02T11:14:43+05:30 IST
చెరువు విషయంలో కాంట్రాక్టర్కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ స్థానిక ఎస్ఐ సుధాకర్ను సస్పెండ్ చేయాలని కొంపల్లి
తిరుమలగిరి(సాగర్), జూలై 1: చెరువు విషయంలో కాంట్రాక్టర్కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ స్థానిక ఎస్ఐ సుధాకర్ను సస్పెండ్ చేయాలని కొంపల్లి గ్రామస్తులు రెండో రోజు బుధవారం మండలకేంద్రంలోని పోలీ్సస్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. జూన్ 29న కొంపల్లి గ్రామం లో చేపలు పట్టే క్రమంలో కొంపల్లి గ్రామస్తులపై చేపల కాంట్రాక్టర్కు సంబంధించిన వ్యక్తులు కర్రలు, కారంప్యాకెట్లు, గొడ్డళ్లతో దాడి చేయడంతో జంగాల మధు అనే యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరుగుతు న్న క్రమంలో స్థానిక ఎస్ఐ పోలీస్ సిబ్బందితో అక్కడే ఉన్నప్పటికీ దాడులను ఆపకుండా సర్పంచ్, చేపల కాంట్రాక్టర్కు వత్తాసుగా మాట్లాడారని వారు ఆరోపించారు. ధర్నాలో మాజీ సర్పంచ్ జంగాల లక్ష్మమ్మ, కాశిమళ్ల ప్రవీన్, జంగాల నాగార్జున, అనిల్, సైదులు, కిరణ్, దేవి, క్రాంతి పాల్గొన్నారు.