ప్రశాంతంగా ఎస్ఐల ప్రిలిమినరీ పరీక్ష
ABN , First Publish Date - 2022-08-08T05:42:33+05:30 IST
ప్రశాంతంగా ఎస్ఐల ప్రిలిమినరీ పరీక్ష
19,992 మంది అభ్యర్థుల హాజరు
వివరాలను వెల్లడించిన సీపీ తరుణ్జోషి
హనుమకొండ క్రైం, ఆగస్టు 7: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల ఎంపిక కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుం చి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, జనగామ, నర్సంపేట ప్రాం తాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష హాల్లోకి పెన్, హాల్టికెట్ తప్ప ఎలాంటి వస్తువులు అనుమతించలేదు. ఒక గంట ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించారు. ముందుగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ సిస్టం ద్వారా పరీక్షించి హాల్లోకి అనుమతించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 21,550 మంది అభ్యర్థులకు హాల్టికెట్లు జారీ చేయగా 19,992 మంది పరీక్షకు హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో 9,223, హనుమకొండలో 8,689, జనగామ జిల్లాలో 2,080 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు వరంగల్ సీపీ తరుణ్జోషి వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ప్రతీసారి మా దిరిగా ఈసారి అభ్యర్థుల సౌకర్యార్ధం పోలీసులు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయలేదు.