వాజేడు పోలీస్స్టేషన్లో SI ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-05T16:34:20+05:30 IST
జిల్లాలోని వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ములుగు: జిల్లాలోని వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ ఎస్ఐగా జెడ్ఎల్ ఠాక్రే పనిచేస్తున్నారు. ఠాక్రే స్వస్థలం మహారాష్ట్ర. మూడేళ్లుగా ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా... కొద్దిసేపటి క్రితమే ఎస్ఐ ఠాక్రే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.