అప్రమత్తంగా ఉండండి: ఎస్‌ఐ

ABN , First Publish Date - 2020-10-15T07:10:43+05:30 IST

నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వాగుల సమీపాల్లో ఉన్న వారు మరింత

అప్రమత్తంగా ఉండండి: ఎస్‌ఐ

గండీడ్‌, అక్టోబరు 14: నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వాగుల సమీపాల్లో ఉన్న వారు మరింత జాగ్రత్త వహించాలని మహ్మదాబాద్‌ ఎస్‌ఐ నాగరాజు చెప్పారు. బుధవారం ఉధృతంగా పారుతున్న అన్నారెడ్డిపల్లి, పీర్లబండ తండా వాగులను ఆయన పరిశీలించారు. వాగులను ఎవరూ దొటకుండా ముళ్ల కంచెను వేశారు. పిల్లలను ఇళ్ల నుంచి బయటికి పంపొద్దన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు.

Updated Date - 2020-10-15T07:10:43+05:30 IST