శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి, బాబూ జగ్జీవన్రాం వర్థంతి
ABN , First Publish Date - 2022-07-07T04:48:09+05:30 IST
బీజేపీ ఆధ్వర్యంలో పలుచోట్ల జన్సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి, మాజీఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్రామ్ వర్థంతిని నిర్వహించారు.
కాగజ్నగర్ టౌన్, జూలై 6: బీజేపీ ఆధ్వర్యంలో పలుచోట్ల జన్సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి, మాజీఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్రామ్ వర్థంతిని నిర్వహించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్కొత్తపల్లిశ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ దేశానికి ఎనలేని సేవలందించిన మహోన్నత వ్యక్తులు శ్యామాప్రసాద్ ముఖర్జీ, బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. స్థానిక ప్రజాకార్యాలయంలో బీజేపీ ప్రధానకార్యదర్శి కొంగసత్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేవైఎం, బీజేపీ నాయకులు గోలెం వెంకటేశం, మాచర్ల శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, కార్తీక్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.