2024 ఒలింపిక్స్ ప్రస్తుతం నా లక్ష్యం: srikanth
ABN , First Publish Date - 2022-06-24T18:25:56+05:30 IST
2024 ఒలింపిక్స్ ప్రస్తుతం తన లక్ష్యమని షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ అన్నారు.
అమరావతి: 2024 ఒలింపిక్స్ ప్రస్తుతం తన లక్ష్యమని షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు టైటిల్ సాధించేలా కృషి చేస్తున్నానాన్ని తెలిపారు. తిరుపతిలో అకాడమీ నిర్మించడంపైన దృష్టిసారించనున్నట్లు చెప్పారు. 2024 ఒలింపిక్స్కు ప్రిపేర్ అవుతున్నానని... థామస్ కప్ను ఇండియాకు సాధించినందుకు ముఖ్యమంత్రి అభినందించారని అన్నారు. 73 ఏళ్ల తర్వాత భారత్కు ఈ కప్ వచ్చిందన్నారు. ఏపీ స్పోర్ట్స్ పాలసీలో థామస్ కప్ను భాగం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని శ్రీకాంత్ పేర్కొన్నారు.