పబ్లిక్ ఇష్యూకు శ్రీరామ్ ప్రాపర్టీస్
ABN , First Publish Date - 2021-04-11T06:11:33+05:30 IST
శ్రీరామ్ ప్రాపర్టీస్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వస్తోంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాఽయిదా పత్రాలు సమర్పించింది
న్యూఢిల్లీ: శ్రీరామ్ ప్రాపర్టీస్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వస్తోంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాఽయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.800 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.550 కోట్లు, కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.250 కోట్లు సమీకరించన్నుట్లు పేర్కొంది. ఇష్యూ లో భాగంగా కంపెనీలో ఇన్వెస్టర్లుగా ఉన్న టీపీజీ క్యాపిటల్, టాటా క్యాపిటల్, వాల్టన్ స్ట్రీట్ క్యాపిటల్, స్టార్వుడ్ క్యాపిటల్ కొంత మేరకు వాటాలను విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలకు శ్రీరామ్ప్రాపర్టీ్సలో 58 శాతం వాటా ఉంది.