జిల్లాలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి
ABN , First Publish Date - 2022-08-19T07:12:33+05:30 IST
జిల్లా అంతటా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
జిల్లా అంతటా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వైష్ణవదేవాలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పల్లకీసేవలు చేశారు. చిన్నారులు శ్రీకృష్ణ, గోపికా వేషధారణతో పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. వివిధ పాఠశాలల యాజమాన్యాలు ఉత్సవాలు నిర్వహించి దినప్రాధాన్యత వివరించారు.
నిర్మల్ కల్చరల్, ఆగస్టు 18 : నిర్మల్ పట్టణంలో గాంధీచౌక్లోని మురళికృష్ణ ఆలయంలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిషేకం, అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం పల్లకిసేవ ఊరేగించారు. సాంస్కృతిక కార్య క్రమాలు, ఉంజల్ సేవ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పోలిశెట్టి కిషన్, లక్ష్మి నారాయణ, పడిగెల విశ్వనాథ్, తదితరులు ఏర్పాట్లు చేశారు.
భైంసా : పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యాలయాల్లో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలల విద్యార్థులు, చిన్నా రులు, శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణతో వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలను వన్నె తెచ్చాయి. శ్రీకృష్ణష్టమి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది.