అయ్యర్ అరంగేట్రం!
ABN , First Publish Date - 2020-11-25T09:51:29+05:30 IST
రోహిత్ అందుబాటులో లేకపోతే వన్డే, టీ20లకు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ను అక్కడే ఉండాల్సిందిగా బోర్డు ఆదేశించనుంది. నిలకడగా రాణిస్తున్న..
న్యూఢిల్లీ: రోహిత్ అందుబాటులో లేకపోతే వన్డే, టీ20లకు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ను అక్కడే ఉండాల్సిందిగా బోర్డు ఆదేశించనుంది. నిలకడగా రాణిస్తున్న అతడికి టెస్టుల్లోనూ పరీక్షించాలని టీమ్ మేనేజ్మెంట్ అనుకుంటోంది. కోహ్లీ కూడా తొలి టెస్టు తర్వాత భారత్కు రానుండడంతో అయ్యర్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇషాంత్ గైర్హాజరీతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు కూడా అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం జట్టులో బుమ్రా, షమి, ఉమేశ్, సైనీ ఇతర పేసర్లుగా ఉన్నారు.