శ్రావణి కేసులో సంచలన విషయాలు వెల్లడించిన దేవరాజ్
ABN , First Publish Date - 2020-09-11T17:35:55+05:30 IST
టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో..
హైదరాబాద్: టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ కేసులో సాయి అకృత్యాలను పోలీసులకు వివరించాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ చెప్పాడు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కొడుతున్నారని శ్రావణి తనతో మాట్లాడిందని చెప్పాడు.
తన చావుకు సాయే కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడిన ఆడియో, అలాగే గతంలో సాయి తనపై (దేవరాజ్) దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టిన సాక్ష్యాలను దేవరాజ్ పోలీసుల ముందుంచాడు. విచారణలో సాయి పాత్రపై దేవరాజ్ సంచలన విషయాలు వెల్లడించాడు. అలాగే కృష్ణానగర్లో అమ్మాయిలను సాయి ట్రాప్ చేస్తాడని దేవరాజ్ చెప్పాడు. శ్రావణిని సయితం అలాగే ట్రాప్ చేశాడని దేవరాజ్ తెలిపాడు. దేవరాజ్తో విడిపోవాలంటూ శ్రావణిని సాయి వేధింపులకు గురిచేశాడని, వేధింపులు తాళలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో దేవరాజ్ వెల్లడించాడు. కాగా నిన్న దేవరాజ్ ఎస్ఎర్ నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన విషయం తెలిసిందే.