AP News: గండి క్షేత్రంలో వైభవంగా శ్రావణ మాసం ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-07-30T16:18:13+05:30 IST
జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
కడప: జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గండి ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకారంలో అంజన్న భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలి శ్రావణ శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశారు.