ఆలయాల్లో ఘనంగా శ్రావణ లక్ష్మి పూజలు

ABN , First Publish Date - 2022-08-13T06:47:50+05:30 IST

నగరంలోని పలు ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. వన్‌టౌన్‌లో వేంచేసి ఉన్న కనకా పరమేశ్వరి అమ్మవారు రజత వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఆలయాల్లో ఘనంగా శ్రావణ లక్ష్మి పూజలు
కనకమహాలక్ష్మి ఆలయంలో లక్ష్మీ హోమం పూజలలో పాల్గొన్న భక్తులు

రజత వస్త్రాలంకరణలో కన్యకాపరమేశ్వరి అమ్మవారు 

మహారాణిపేట, ఆగస్టు 12: నగరంలోని పలు ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. వన్‌టౌన్‌లో వేంచేసి ఉన్న కనకా పరమేశ్వరి అమ్మవారు  రజత వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  వేకువజామునే అమ్మవారి మూలవిరాట్‌కు 108 రకాల సుగంధ ద్రవ్యాలు పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా రజత వస్త్ర అలంకరణ చేసి పూజలను నిర్వహించి,  భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలో మహిళలతో సామూహిక శ్రీచక్ర సహిత కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ మాత ఉత్సవ విగ్రహానికి  శాకాంబరి రూపంలో అన్ని రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. కనకమహాలక్ష్మి ఆలయంలో జరిగిన విశేష పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


Updated Date - 2022-08-13T06:47:50+05:30 IST