శ్రావణ శోభితం
ABN , First Publish Date - 2022-08-20T06:24:09+05:30 IST
శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని నకాసిబజార్లో కనకదుర్గమ్మ ఆలయం, గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
జగ్గయ్యపేట, ఆగస్టు 19: శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని నకాసిబజార్లో కనకదుర్గమ్మ ఆలయం, గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో బలుసుపాడు రామాలయంలో పెనుగొండ రాజీవ్ వితరణతో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. అనుమంచిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి, వత్సవాయి మండలం కన్నెవీడులో మారెమ్మ దేవస్థానంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ ఆలయంలో సామూ హిక వరలక్ష్మి వ్రతాలను శుక్రవారం వైభవంగా నిర్వహిం చారు. ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద మహాలక్ష్మి, తిరుపతమ్మ - గోపయ్య స్వాముల ఉత్సవ మూర్తులకు చైర్మన్ ఇంజం చెన్నకేశవరావు, ధర్మకర్తలు ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీదేవి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమంలో ఏఈవో తిరుమలేశ్వరరావు, ఈఈ వైకుంఠరావు, సూపరింటెండెంట్ సునీత, ఏరువ వెంకటేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.