శ్రావణి ఆత్మహత్య కేసు... దేవరాజ్, సాయి అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-14T00:10:44+05:30 IST
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రేమ పేరిట దేవరాజ్ వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని సాయి ఆరోపిస్తుండగా
హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రేమ పేరిట దేవరాజ్ వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని సాయి ఆరోపిస్తుండగా, సాయి వేధింపుల వల్లే మృతిచెందిందని దేవరాజ్ ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఫోన్ రికార్డులను ఇద్దరూ బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే సాయికృష్ణారెడ్డి, దేవరాజ్లను ఎదురెదురుగా కూర్చొబెట్టి పోలీసులు విచారించారు. శ్రావణిని దేవరాజ్ బెదిరించిన ఆడియోలు.. శ్రావణిని సాయి కొట్టినట్లు బయటికి వచ్చిన ఆడియోలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
వీరిద్దరి స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. అనంతరం దేవరాజ్, సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తారు. దేవరాజ్, సాయిలతో పాటు వీరిద్దరి కుటుంబసభ్యులను కూడా పోలీసులు విచారించారు. అయితే శ్రావణి కేసులో A1, A2 ఎవరనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సాంకేతిక పరమైన ఆధారాలతో పాటు.. సాయి, దేవరాజ్, శ్రావణిలు మాట్లాడిన ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. దేవరాజ్ తల్లితో శ్రావణి పోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు.