ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు: Shravan Kumar
ABN , First Publish Date - 2022-07-06T20:44:10+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎప్పుడు లేని విధంగా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని శ్రావణ్ కుమార్ అన్నారు.
గుంటూరు (Guntur): ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రైతులు (Farmers) ఎప్పుడు లేని విధంగా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని గుంటూరు జిల్లా టీడీపీ (TDP) అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ (Shravan Kumar) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో అయితే పంట పండించడం అనవసరం అనే అభిప్రాయానికి రైతులు వచ్చారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని, రైతును దగా చేసే కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు తయారయ్యాయని ఆరోపించారు. వైసీపీ నాయకులకు కమీషన్ ఆఫీస్గా రైతు బరోసా కేంద్రాలు ఉన్నాయని శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు.