సాక్షి అధికార పార్టీ కర పత్రం: శ్రావణ్ కుమార్

ABN , First Publish Date - 2021-04-16T19:34:57+05:30 IST

సాక్షి పత్రిక యాజమాన్యంపై శ్రావణ్ కుమార్ మండిపడ్డారు.

సాక్షి అధికార పార్టీ కర పత్రం: శ్రావణ్ కుమార్

విజయవాడ: సాక్షి పత్రిక యాజమాన్యంపై శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి అధికార పార్టీ కర పత్రమని విమర్శించారు. అటువంటి పత్రికలో అంబేద్కర్‌ను అవమానించేలా ఫొటో వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాణకర్తకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని దుయ్యబట్టారు. దీనిపై సీఎం, యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. ఫొటో ప్రచురితానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ మాటలతో మోసం చేయకుండా చేతల్లో దళితులకు న్యాయం చేయాలని శ్రావణ్ కుమార్ కోరారు. 

Updated Date - 2021-04-16T19:34:57+05:30 IST